డిక్కి బలిసిన కోడి చికెన్ షాపు ముందుకెళ్లి తొడ కొట్టిందట.. రామనవమి శోభయాత్ర వేళ ‘అతి’వాదుల చేష్టలు చూస్తే ఈ విషయం క్లియర్కట్గా అర్థమవుతుంది. పనిగట్టుకొని మసీదుల వద్ద రెచ్చగొట్టే చర్యలకు ఇటీవలి కాలంలో భక్త పరివారానికి అలవాటుగా మారింది. అది కాస్త రామనవమి సందర్భంగా శృతి మించింది. సామాన్య భక్తులు సాధారణంగా రామనవమి చేసుకుంటే కొందరు అతిభక్తులు మాత్రం మసీదుల ముందు ముస్లింలను ట్రిగ్గర్ చేసే పనులకు పూనుకున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి మాట్లాడుకోవడం దండగ.. ఆయన గురించి ప్రత్యేకంగా విమర్శిస్తే అది జర్నలిస్టు పెన్నుకు, టైప్ చేస్తే కీబోర్డుకు కూడా ఘోర అవమానమే అవుతుంది. అందుకే ఆయన గురించి పక్కనపెడదాం. మిగిలిన అతిభక్తులు ఎందుకిలా చేస్తున్నారో అర్థంకాని దుస్థితి. మన పండగ మనం చేసుకునేందుకు అవతలి మతాల వారితో పనేంటో.. ఈ వింత పోకడలేంటో తెలియని పరిస్థితి.
#JUSITN
రామనవమి వేడుకలు జరుగుతున్నప్పుడు, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత, మసూతిని లక్ష్యంగా చేసుకుని అంబులెక్కి ఎవడు వంటి వివాదం సృష్టించింది #MadhaviLatha #Hyderabad #News18TamilNadu | https://t.co/3v5L32pLWJ pic.twitter.com/7DHpDZPXEn— News18 తమిళనాడు (@News18TamilNadu) ఏప్రిల్ 18, 2024
ప్రతికూలతను సృష్టించేందుకు నా వీడియో ఒకటి మీడియాలో ప్రచారంలో ఉందని నా దృష్టికి వచ్చింది.
ఇది అసంపూర్ణమైన వీడియో అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను మరియు అలాంటి వీడియో కారణంగా ఎవరైనా మనోభావాలు దెబ్బతింటుంటే, నేను వ్యక్తులందరినీ గౌరవిస్తాను కాబట్టి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను.
— కొంపెల్ల మాధవి లత (మోదీ కా పరివార్) (@Kompella_MLatha) ఏప్రిల్ 18, 2024
క్షమాపణ చెప్పడం కూడా తప్పే:
రామనవమి శోభయాత్ర సందర్భంగా హైదరాబాద్ లోక్సభ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత కొంపెల్ల బాణాలు విసిరారు. అంటే నిజమైన బాణాలు కాదు.. ఆవిడకు ఆవిడే చేతిలో బాణం ఉందని ఊహించుకోని బాణాలు సంధించారు. అది మసీదులవైపు గురి పెట్టినట్లు ఉన్నాయని కొన్ని వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అది అసంపూర్ణమైన వీడియో అని.. ఒకవేళ ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమించాలని మాధవిలత ముస్లిం కమ్యూనిటీకి ట్విట్టర్లో సారీ చెప్పారు. అయితే ఇది కూడా అతిభక్తులకు ఏ మాత్రం నచ్చలేదు. క్షమాపణ ఎందుకు చెప్పావ్ అంటూ ఆమెను దూషించారు. రాజాసింగ్ అయితే ఇలా సారీ చెప్పడంతో ఆయన వర్గం కామెంట్స్లో దూరింది. అంటే నిజంగానే అలా రెచ్చగొట్టాలన్నది వారి ఉద్దేశ్యం. ఇంత దిగజారిన మనస్తత్వం హైదరాబాద్లో హెచ్చుమీరుతుండడం నిజంగా బాధాకరం!
#indtoday : #శోభాయాత్ర 2024 కి ముందు , #హైదరాబాద్ పోలీసులు నగరం అంతటా భారీ #భద్రతను మోహరించారు .
ఇటీవల, #రామనవమి ఊరేగింపు కోసం # రాజాసింగ్కు నగర పోలీసులు అనుమతి నిరాకరించారు . శోభా యాత్ర ఎట్టిపరిస్థితుల్లోనూ ఆకాశ్ పూరి హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమవుతుందని, దానిని ఎవరూ ఆపలేరు #MLA అన్నారు. pic.twitter.com/bFPOTpLNt1
— indtoday (@ind2day) ఏప్రిల్ 17, 2024
మీరు ఎన్ని మందిరాలు నిర్మించినా వారు మసీదు ముందు నృత్యం చేస్తారు. #RamNavami2024 #RamNavami pic.twitter.com/3NAS0xeiwZ
— రాజికుల్ (@Rajikul2441) ఏప్రిల్ 18, 2024
ఓట్ల కోసం దిగజారుడుతనం:
ఇలా మసీదుల చుట్టూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం ఇదేమీ కొత్త కాదు. అయితే ఈసారి ఈ అతివాదం బాగా ముదిరినట్టు కనిపించింది. ఇలాంటి వాటిని బీజేపీ నేతలే దగ్గరుండి చేయిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు మసీదులు కనపడకుండా చాలా చోట్ల పరదాలు కప్పారు. ఇలా మసీదుల ముందు రెచ్చగొట్టే చర్యలకు సిద్ధమని వీరందరికి ఏ దేవుడు చెప్పాడు? 33 కోట్ల దేవుళ్లలో ఒకరైనా చెప్పారా? ఇదంతా మెజారిటీ వర్గమైన హిందూవుల ఓట్ల కోసం బీజేపీ నూరిపోస్తున్న విషపు సంస్కృతి. ప్రతీచోటా ఇదే కదా వాళ్లు చేసేది..!
ఇది కూడా చదవండి: మోదీ పచ్చి అబద్ధాలు.. ఏకంగా సుప్రీం తీర్పునే మార్చేస్తున్నారు!