Menu

Kerala Shocker: క్షుద్బాధతో చచ్చిన పిల్లిని తిన్నాడు..!

Tri Ten B
Man did not eat food for 5 days

పేదవారు మరింత పేదవారిగా.. ఉన్నవాడు మరింత ఉన్నతంగా ఎదిగే క్యాపిలిస్ట్ దేశాల్లో ఆకలి బాధల గురించి పట్టింపులు ఉండవు. అందుకే కేరళ(Kerala)లో ఓ యువకుడు చచ్చిన పిల్లిని తిన్నాడు. అతనికేం మానసిక సమస్యలు లేవు.. ఫిజికల్‌ కూడా ఎలాంటి సమస్యలు లేవు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాడు. చేతిలో డబ్బుల్లేవ్‌.. రోడ్డుపై ఏది దొరికితే అది తిన్నాడు.. 5రోజుల నుంచి ఏమీ దొరక్కపోవడంతో పిల్లి కళేబరాన్ని పీక్కుతిన్నాడు. పొలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.. ముందు బట్టలు మార్చారు.. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతనికి ఎలాంటి మానసిక, ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్లు చెప్పారు.

అసల విషయమేంటని పోలీసులు అతడిని ఆరా తీశారు. గత డిసెంబర్ 12న అసోం నుంచి రైలెక్కి పారిపోయి కేరళ మలప్పురం జిల్లా కుట్టిపురం వచ్చినట్టు చెప్పాడు. యువకుడికి ఓ సోదరుడు ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అతనికి కాల్ చేశారు. తాను చెన్నైలో జాబ్ చేస్తున్నానని సోదరుడు చెప్పాడు. కేరళ వచ్చి తన తమ్ముడిని తీసుకెళ్తానన్నాడు. అయితే మరుసటి రోజు ఫోన్ చేసి తమకు తన తమ్ముడు అవసరం లేదని చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. అసలిబ్బాయి ఎందుకు పారిపోయి వచ్చాడో తెలియదు.. పనిలేకుండా ఎందుకు తిరుగుతున్నాడో తెలియదు.. పనిచేతనవుతుందో తెలియదు.. ఇదంతా ఆ యువకుడి తప్పేకావొచ్చు.. లేదా ఇంట్లోవారిది కావొచ్చు.. కానీ ఓ మనిషి ఆకలితో చచ్చిన పిల్లిని తిన్నాడంటే ఈ వ్యవస్థలో లోపం లేదని చెప్పగలరా?

Also Read: సెన్స్‌లెస్‌, లూజ్‌ టాక్‌.. సందీప్‌ రెడ్డి వంగా ఇది తగ్గించుకుంటే మంచిది!

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *