శ్రీలంక(Sri Lanka)లో గత వారం మొదలైన భారీ వర్షాలు ఏ రోజుకి ఆ రోజుకి మరింత ఉధృతం అవుతూ దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. దిత్వా(Ditwah) తుఫాను(Cyclone) ప్రభావంతో తూర్పు, మధ్యభాగాల్లో వందల మిల్లీమీటర్ల వర్షం పడటంతో అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ప్రత్యేకంగా బడుల్ల, నువర ఎలియా లాంటి కొండప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం తీవ్రమైన విషాదాలకు దారితీసింది. వర్షం తీవ్రత తగ్గకుండా కొనసాగుతుండటంతో మరిన్ని ప్రమాదాలు సంభవించే అవకాశంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వరద పరిస్థితుల కారణంగా 69మంది చనిపోయారు.
విమాన ప్రయాణాలు ఆలస్యం:
వరదలు(Floods) అకస్మాత్తుగా ముంచెత్తడంతో ప్రజలు తమ ఇళ్లల్లో చిక్కుకుపోయారు. అనేక ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారులు, గ్రామీణ రోడ్లు, రైల్వే మార్గాలు రాళ్ళతో మూసుకుపోయాయి. రవాణా వ్యవస్థ దాదాపు స్థంభించి, పట్టణ ప్రాంతాల్లో కూడా నీటి ప్రవాహం నియంత్రించలేని స్థాయికి చేరింది. రాత్రివేళల్లో కరెంట్ నిలిచిపోవడం, నీటి సరఫరా ఆగిపోవడం లాంటి సమస్యలు మరింత ఇబ్బందులను తెచ్చాయి.
ALSO READ: బంగాళాఖాతంలో మరో తుఫాను? ఆంధ్రప్రదేశ్కు మరో ముప్పు తప్పదా?
దేశంలోని ప్రముఖ విమానాశ్రయమైన కొలంబో బందరణాయక అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేలు నీటితో కప్పుకుపోవడంతో 12అంతర్జాతీయ విమానాలు ఇతర దేశాలకు లేదా దక్షిణ ప్రాంతంలోని మరో విమానాశ్రయానికి మళ్లించబడ్డాయి. దీనివల్ల ప్రయాణికులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. విమాన సిబ్బంది, అధికారులు పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేస్తున్నప్పటికీ భారీ వర్షపాతం ఆ ప్రయత్నాలకు ఆటంకంగా మారింది.
ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేసి సహాయక కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వేలాది మంది అక్కడ ఉండేలా ప్రభుత్వం ఆహారం, ఔషధాలు, తాగునీరు వంటి అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తోంది. సైనిక హెలికాప్టర్లు, రబ్బరు పడవలు, బోట్లను ఉపయోగించి ఇళ్ల పైకప్పులపై చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయడం, రైలు సర్వీసులు నిలిపివేయడం, స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ను ముందుగానే ముగించడం వంటి చర్యలు ప్రజల రక్షణకే తీసుకున్నవిగా అధికారులు చెబుతున్నారు. రోడ్లపై రాతిబండలు, చెట్టు కొమ్మలు పడిపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా మూసివేయబడ్డాయి. రక్షణ సిబ్బంది ఆ అవరోధాలను తొలగించే పనిలో ఉన్నారు కానీ నిరంతర వర్షం పని వేగాన్ని తగ్గిస్తోంది.
ఎందుకింత విధ్వంసం?
ఈ పరిస్థితులను వాతావరణ శాస్త్రవేత్తలు సముద్రజలాలు వేడెక్కడం వల్ల ఏర్పడే తక్కువ ఒత్తిడి వ్యవస్థల ప్రభావంగా చెబుతున్నారు. సముద్రంపై వేడి గాలి వరుసగా పైకి ఎగసిపడటం, దాని స్థానంలో మరో వేడి గాలి చేరడం వంటి ప్రక్రియలు గాలి చక్రాన్ని శక్తివంతం చేసి భారీవర్షాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ వ్యవస్థలో గాలివేగం పెరిగితే అది తీవ్రమైన చుడుపుల తుఫానుగా మారే అవకాశం కూడా ఉంటుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ ఇంకా కొందరు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అదనంగా, వర్షాలు కొనసాగుతుండటం వల్ల కొండప్రాంతాల్లో మరింత జాగ్రత్త అవసరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు అధికారుల సూచనలను పాటించాలని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని ప్రభుత్వ విభాగాలు చెబుతున్నాయ్.
ఈ విపత్తు శ్రీలంకకు ప్రకృతి వైపరీత్యాలపట్ల మరింత సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. పట్టణ ప్రణాళిక, వృక్షాల నరికివేత నియంత్రణ, నదీ పరీవాహక ప్రాంతాల రక్షణ, అత్యవసర సహాయక వ్యవస్థల శక్తివంతం వంటి అంశాలపై ప్రభుత్వం భవిష్యత్తులో మరింత దృష్టి పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం మాత్రం ప్రాణాలను రక్షించడం, బాధితులకు అవసరమైన సాయం చేరవేయడం అత్యంత ప్రాధాన్యంగా మారింది.
ALSO READ: మహిళలకు గుడ్ న్యూస్.. గర్భాశయ క్యాన్సర్కు చెక్?

Asia Climate Change: 2 కారణాలు.. గాల్లో లక్షల ప్రాణాలు..సైంటిస్టుల షాకింగ్ స్టడీ!
Railway Jobs: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. లక్షకు పైగా రైల్వే ఉద్యోగల భర్తీపై కీలక అప్డేట్!
Disasters in Asia: వీధిన పడ్డ బతుకులు.. ఆసియాపై పగబట్టిన ప్రకృతి.. లక్షలమంది బలి!
Indonesia: మృత్యు ఒడిలోకి 313మంది..! ఆ దేశంలోనే వరదలు, భూకంపాలు ఎందుకు?
New Year Plans: తెలంగాణ టూరిజం గోవా టూర్ ప్యాకేజ్.. న్యూఇయర్కి భలే ఆఫర్ బాస్.. పూర్తి వివరాలివే!
Aadhar Update: కాలు బయటకు పెట్టాల్సిన అవసరమే లేదు.. ఇంటి నుంచే మీ మొబైల్ నంబర్తో పాటు ఆధార్ అడ్రెస్ను ఇలా ఇలా అప్డేట్ చేసుకోండి!