Menu

NABARD News: గ్రేడ్-A పోస్టులకు నోటిఫికేషన్ జీతం రూ.89000.. ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు!

Lakshmi Aruna 3 months ago
NABARD jobs telugu

బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు శుభవార్త. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 91 పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్ ఫారమ్‌లను ఫిల్‌ చేయడానికి నవంబర్ 30, 2025 చివరి తేదీ.

ఎలా దరఖాస్తు చేయాలి:

ముందుగా NABARD అధికారిక వెబ్‌సైట్ nabard.org కి వెళ్లండి.

హోమ్‌పేజీలోని రిక్రూట్‌మెంట్ విభాగానికి వెళ్లి, ‘అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A 2025‘ నోటిఫికేషన్‌ను తెరవండి.

ఇప్పుడు అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేసి, మీ రిజిస్ట్రేషన్ వివరాలను పూరించండి.

ఫారమ్‌లో వ్యక్తిగత సమాచారం, విద్యా సమాచారం, పత్రాలను అప్‌లోడ్ చేయండి.

కేటగిరీ ప్రకారం దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో సమర్పించండి.

సమర్పించిన తర్వాత, ఫారమ్ ప్రింటవుట్‌ను మీ వద్ద ఉంచుకోండి.

జీతం:

ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ44,500 నుంచి రూ.89,150 వరకు లభిస్తుంది. అదనంగా, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, వైద్య ప్రయోజనాలు, కార్యాలయ భత్యంతో పాటు అనేక పదోన్నతి అవకాశాలు కూడా ఉంటాయి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి, కనీసం 20శాతం మార్కులతో ఉండాలి. వయోపరిమితి విషయానికొస్తే, అభ్యర్థులు 20-30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

ALSO READ: 10th,12th టాపర్.. చివరకు IFS ర్యాంకర్..! అదితి సక్సెస్ సీక్రెట్ ఇదే!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *